

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ దేశాలపై విధించిన టారిఫ్ల గురించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఒక సభలో మాట్లాడిన ట్రంప్, సుప్రీంకోర్టు టారిఫ్లకు వ్యతిరేకంగా ఏదైనా తీర్పు ఇస్తే, అది అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెడతుందని హెచ్చరించారు. సుంకాలపై కోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్లను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ, తాను విధించిన టారిఫ్ల వల్ల అమెరికా ఖజానాకు వందల బిలియన్ డాలర్లు వచ్చాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో తాను తీసుకునే నిర్ణయాలు కూడా అమెరికాకు మరిన్ని లాభాలు చేకూరుస్తాయని చెప్పారు.
సుప్రీంకోర్టు తన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తే, దేశానికి ఆర్థిక రక్షణ లేకుండా పోతుందని ట్రంప్ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు అమెరికాతో ఎలా ప్రవర్తిస్తున్నాయో, తాము కూడా అదే రీతిలో ప్రతిస్పందిస్తామని, ఈ విధానాన్ని అడ్డుకునే అధికారం ఎవరికి లేదని స్పష్టం చేశారు. తమ సుంకాల విధానం వలన అమెరికా జాతీయ భద్రత బలపడిందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టం ఆధారంగా ట్రంప్ అనేక దేశాలపై భారీ టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని అమలు చేసే సమయంలో ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో కొన్ని కోర్టులు ఈ నిర్ణయాలను నిలిపివేశాయి. దీనితో అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ విషయం పై విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!