

తమిళనాడు శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున కార్లు, వ్యక్తిగత సహాయకులను కేటాయించే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 234 మంది సభ్యులున్న సభలో పెద్ద సంఖ్యలో కొత్త ముఖాలు అడుగుపెట్టారు. ముఖ్యంగా అధికార తమిళగ వెట్రి కళగం (TVK) నుంచి గణనీయ సంఖ్యలో కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన 146 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే శాసనసభ విధానాలు, సభా నియమాలు, పార్లమెంటరీ సంప్రదాయాలపై ప్రత్యేక శిక్షణ కూడా నిర్వహించారు.
కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సొంత వాహనాలు, వ్యక్తిగత సహాయకులను ఏర్పాటు చేసుకోవడం ఆర్థికంగా భారంగా మారుతోందని సభలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఈ అభ్యర్థనను ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!