
గాసిప్స్
.jpg&w=3840&q=75)
విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. భవానీలు ఏ ఇబ్బందులు పడకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.
డిసెంబర్ 11 నుంచి 15 వరకు దీక్షల విరమణలు జరుగుతాయని, ఈ కాలంలో దాదాపు 6 లక్షలకు పైగా భవానీలు రావచ్చని అంచనా వేసారు. ఇంద్రకీలాద్రి చుట్టూ సుమారు 9 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు.
దీక్షల విరమణ సమయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేసినట్టు హోంమంత్రి స్పష్టం చేశారు. చిన్న పిల్లలు తప్పిపోకుండా స్కానర్ ట్యాగ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భక్తులకు ప్రసాదం కొరత లేకుండా 60 లక్షల లడ్డూలు సిద్ధం చేశామని, నిత్యాన్నదానం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!