
టెక్నాలజీ

ఫిరాయింపు కేసులో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారారని పేర్కొంటూ ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే సంజయ్ పార్టీ మారారనే విషయాన్ని నిరూపించే సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేస్తూ, అనర్హత పిటిషన్ను కొట్టివేశారు.
మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొనగా, ఇందులో ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రస్తుతం కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై ఉన్న అనర్హత పిటిషన్లపై మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!