.jpg&w=3840&q=75)

రైతుబంధు వంటి సంక్షేమ పాలన ముగిసి, రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. గత నవంబర్ 18 న ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. అక్కడ పంట అమ్మకానికి వచ్చిన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ) గ్రామానికి చెందిన తుడుం గణపతి అనే రైతు, తన సోయాబీన్ పంటను కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులోనే ఉండి కూడా పంట కొనుగోలు జరగలేదని, మీడియా ముందు తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడని అన్నారు.
ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకపోతే తనకు మార్గం లేదని గణపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడని పేర్కొన్నారు. రుణమాఫీ అమలు కాకపోవడం, రైతుభరోసా అందకపోవడం, అప్పుల భారంతో తీవ్ర ఒత్తిడికి గురైన గణపతి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ తెలిపారు.
ఈ ఘటనను కేటీఆర్ తీవ్రంగా ఖండిస్తూ, ఇది సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరిగిన ఘటనగా అభిప్రాయపడ్డారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!