
గాసిప్స్

నియామకాల అంశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మరింత వేగంగా, సమర్థవంతంగా స్పందించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్పర్సన్ల జాతీయ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.
1950 సంవత్సరం తర్వాత యూపీఎస్సీతో పాటు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు ప్రారంభమైందని ఆమె గుర్తుచేశారు. ఈ వ్యవస్థల రూపకల్పనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ప్రస్తుతం నియామకాల ప్రక్రియలో ఎదురవుతున్న సవాళ్లకు వేగవంతమైన పరిష్కారాలు అవసరమని రాష్ట్రపతి పేర్కొన్నారు. అభ్యర్థుల్లో విశ్వాసం పెంచేలా ప్రతి దశలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్లకు సూచించారు. సమయపాలనతో పాటు న్యాయబద్ధమైన ఎంపిక విధానం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!