
క్రీడలు

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రెబల్ గ్రూపు ఒకే రోజు రెండు పెద్ద షాకులు ఇచ్చింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించడంతో పాటు, మరింత మంది మద్దతుదారులు తమవైపు చేరుతున్నారని వెల్లడించింది. కోల్కతా మాజీ మేయర్ ఫర్హాద్ హకీం తమ గ్రూపులో చేరినట్లు రెబల్ నేత రితబ్రత బెనర్జీ తెలిపారు.
కోల్కతా న్యూటౌన్లో జరిగిన సమావేశంలో సుమారు 500 మంది నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో 30 మంది సభ్యులతో కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అరూప్ రాయ్ను ఛైర్పర్సన్గా నియమించారు. తమదే అసలైన టీఎంసీ అని రెబల్స్ ప్రకటిస్తూ, నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!