

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ మరింత ఉత్కంఠను రేపుతోంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ విచారణలో, పార్టీ ఆర్థిక లావాదేవీలు, ఎలక్టోరల్ బాండ్ల అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న నేపథ్యంలో, నిధుల సమీకరణపై ప్రత్యేకంగా విచారించినట్లు సమాచారం.
మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధులు వసూలు చేసిందన్న ఆరోపణలు ఈ కేసులో కీలకంగా మారాయి. వ్యాపారి శ్రీధర్ రావు ఫిర్యాదు ప్రకారం, తనను బెదిరించి రూ.12 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పించారని, అదనంగా మరో రూ.3 కోట్లు ప్రైవేట్ పంచాయతీ ద్వారా చెల్లించాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇదే తరహాలో మరికొందరు వ్యాపారులు కూడా ఫిర్యాదులు చేయడంతో, వాటి ఆధారంగా కేటీఆర్ నుంచి సిట్ వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, సినీనటులు, రాజకీయ నాయకులపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!