
గాసిప్స్

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలతో బ్రేక్ఫాస్ట్ సమావేశం జరగనుంది. పార్టీ ప్రస్తుత పరిస్థితులు, రానున్న కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ భేటీ అనంతరం ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీకి సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!