
సినిమాలు

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్లో జరిగిన చారిత్రాత్మక సింహగర్జన సభకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా భావోద్వేగ పోస్ట్ చేశారు. 2001 మే 17న జరిగిన ఆ సభ నుంచి ఇటీవల నిర్వహించిన రజతోత్సవ వేడుకల వరకు బీఆర్ఎస్ పార్టీ అదే జోష్, అదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ధనం, రాజకీయ బలం లేకపోయినా సింహగర్జన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణపై ఉన్న ప్రేమ, రాష్ట్ర సాధనపై పట్టుదల, ప్రజల మద్దతుపై నమ్మకం, తెలంగాణ బాధపై ఆవేదనే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను నడిపించిన నాలుగు రథ చక్రాలని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!