

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారికి ప్రార్థనలు అర్పించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో, ఆలయ పరిసరాల్లో నిర్మించనున్న వసతి సదుపాయాల పనులకు పవన్ కళ్యాణ్ భూమిపూజ చేశారు. సుమారు రూ.35.19 కోట్ల నిధులతో 96 గదుల ధర్మశాలతో పాటు దీక్ష విరమణ మండపాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విశ్రాంతి, వసతి మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి రానుంది.
భూమిపూజ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల అనుభూతిని మరింత మెరుగుపరచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!