

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పార్టీని విడిచి వెళ్లిన నాయకులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల పదవులు పొందిన నాయకులు మరియు అనుబంధ సంఘాల ప్రతినిధులతో మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ ద్వారా లాభాలు పొందిన తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లి మళ్లీ తిరిగి రావాలనుకునే వారికి అవకాశం ఉండదన్నారు. బంధుత్వాలు లేదా వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి పార్టీలోకి తిరిగి రావాలని ప్రయత్నించినా అనుమతించబోమని స్పష్టం చేశారు. అర్హతలేని, విశ్వాసం లేని నాయకులను పార్టీలోకి తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
గతంలో వరదాపురం సూర్యనారాయణ కాలంలో పార్టీ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు ఆయన స్వయంగా చూసుకునేవారని గుర్తు చేశారు. అయితే తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, పార్టీ కార్యకర్తలే కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులకు ఎప్పుడూ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వైకాపా పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, సాయికుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!