

కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించగా, ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీ నిపుణుడిని కూడా కేటాయించారు. తెలంగాణ భవన్లో వీరికి ప్రత్యేక డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. సభ్యత్వ నమోదు కోసం రూపొందిస్తున్న డిజిటల్ యాప్కు తుది మెరుగులు దిద్దుతున్నారు.
తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం జిల్లా పార్టీ కార్యాలయాల్లో నియోజకవర్గాల వారీగా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రతి బూత్కు ఇద్దరు ప్రతినిధుల చొప్పున వారం రోజులపాటు శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణకు హాజరయ్యే వారికి భోజన సదుపాయాలు కల్పించనున్నారు. డిజిటల్ శిక్షణ పూర్తయ్యాక సభ్యత్వ నమోదు తేదీలను ప్రకటిస్తారు. ఆ రోజు పార్టీ అధినేత కేసీఆర్తో పాటు ముఖ్య నేతలు సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!