
గాసిప్స్

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
ఎమ్మెల్యేపై వచ్చిన మహిళా ఆరోపణలతో పాటు ఇతర ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ జరపాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అరవ శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వాలని జనసేన పార్టీ సూచించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!