
గాసిప్స్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించనున్న సెలబ్రేట్ ది స్కై కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు వారు ముఖ్యమంత్రికి వివరించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలో పతంగుల ప్రదర్శన, హాట్ ఎయిర్ బెలూన్స్, డ్రోన్ల ప్రత్యేక షోలు ఆకర్షణగా నిలవనున్నాయి.
సంక్రాంతి సంబరాలకు మరింత రంగు అద్దేలా ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సెలబ్రేట్ ది స్కై కార్యక్రమం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, కుటుంబాలతో కలిసి చూసే వినోదాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.














.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!