

మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. 140 స్థానాల్లో దాదాపు 100 సీట్లు గెలుచుకోవడం చారిత్రాత్మక విజయమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, నాయకులు నిర్వహించిన ప్రచారం కేరళలో ప్రభావం చూపిందని ఆయన తెలిపారు. తెలంగాణ పాలనను చూపిస్తూ ఓట్లు కోరడం ప్రజలపై ప్రభావం చూపిందన్నారు. ఈ విజయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని, భవిష్యత్ ఎన్నికల్లో విజయంపై నమ్మకాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయాన్ని అభినందించారు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, SIR పేరుతో ఓట్లను తొలగించడం, వ్యవస్థలను దుర్వినియోగం చేయడం వంటి చర్యలను విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఫలితాలను సమీక్షించి ఇండియా కూటమి బలపడేలా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!