

లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన విషాదాలను ఆయన మర్చిపోయారా? అని ప్రశ్నించారు. పార్లమెంటు వెలుపల ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితిని కోవిడ్ కాలంతో పోల్చడం సరికాదని రాహుల్ గాంధీ అన్నారు. ఎల్పీజీ, పెట్రోల్ ధరలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి పోలికలు చేయడం అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్ సమయంలో జరిగిన భారీ నష్టాలు, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ప్రధాని మోదీ మరిచిపోయినట్లుగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. అలాగే విదేశాంగ విధానంపైనా రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యక్తిగత విదేశాంగ విధానంగా దేశ విధానం మారిందని, ఇది అంతర్జాతీయ స్థాయిలో హాస్యాస్పదంగా మారుతోందని అన్నారు.
మధ్య ఆసియా పరిణామాలపై ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశంపై కూడా రాహుల్ స్పందించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటికే నిర్మాణాత్మకంగా సరిదిద్దుకోలేని తప్పిదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సూచనల ప్రకారం మోదీ పనిచేస్తున్నారని, రైతులు మరియు దేశ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కేరళలో ముందుగా ఉన్న కార్యక్రమం కారణంగా తాను అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవచ్చని రాహుల్ గాంధీ తెలిపారు.













కామెంట్స్ (1)
Very sad Pity on RAGA for making such inappropriate comments on MODI Ji. He is very irresponsible that he didn't attend the All-Party Meeting held in this current situation. This is not the time for politics.