
న్యూస్

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ఈ రేసింగ్ ఈవెంట్లో మొత్తం ₹54.88 కోట్లు దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పాత్రపై తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంటూ ఏసీబీ ఇటీవల గవర్నర్కు లేఖ రాసి ప్రాసిక్యూషన్ అనుమతి కోరింది.
ఆ లేఖను పరిశీలించిన గవర్నర్ తాజాగా ఏసీబీకి అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ త్వరలోనే ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!