

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23 న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కి జనవరి 22 న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణల పై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర పై విచారణలో భాగంగా జనవరి 23 న ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గతంలో మిథున్ రెడ్డి ని అరెస్టు చేయగా, అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కుంభకోణం వేల కోట్ల రూపాయల మేరకు మద్యం విధానంలో జరిగిన అవకతవకలు, సరఫరాదారుల పై ఒత్తిడి, డిస్టిలరీలు మరియు పంపిణీదారుల నుంచి ముడుపుల వసూళ్లకు సంబంధించినదిగా సిట్ పేర్కొంది. 2025 లో జరిగిన ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు, విధాన రూపకల్పనలో పాత్ర ఉందని ఆరోపిస్తూ సిట్ కేసు నమోదు చేసింది.
అధికారులను ప్రభావితం చేశారని, కీలక సమావేశాల్లో పాల్గొని రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యారని సిట్ ఆరోపణల్లో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా, కొంతమంది మద్యం సరఫరాదారులకు లాభం చేకూర్చేలా విధాన ప్రక్రియను మలిచినట్లు ఆరోపించారు. దాదాపు 71 రోజుల కస్టడీ అనంతరం 2025 సెప్టెంబర్ చివర్లో కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!