

రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. జనవరి 2 నుంచి జనవరి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుండగా, ఎమ్మెల్యేలు మరియు మంత్రుల చేతుల మీదుగా అర్హులైన రైతులకు పాసుపుస్తకాలు అందజేస్తున్నారు. వేలాది గ్రామాల్లో సంబరంగా మొదలైన ఈ కార్యక్రమం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పాసుపుస్తకాలను రైతులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి అభివర్ణించారు.
ఈ సందర్భంగా మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు తలెత్తాయని, వివాదాలు లేని భూములను కూడా రీ సర్వే పేరుతో సమస్యాత్మకంగా మార్చారని విమర్శించారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల్లో ఉన్న అభద్రతను తొలగించామని పేర్కొంటూ, భూ వివాదాల పరిష్కారంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు మరింత చొరవ చూపాలని, నిర్ధిష్ట గడువుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!