

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పనితీరుతో రాజకీయ ప్రత్యర్థుల నుంచీ కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. దాదాపు రోజుకు 18 గంటల పాటు విరామం లేకుండా పనిచేయడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. అత్యంత బిజీ రోజుల్లో కూడా కుటుంబ బాధ్యతలు, రాజకీయ కార్యక్రమాల మధ్య సమతుల్యత సాధించడమే ఆయనను అనేక మందికి ఆదర్శంగా మార్చిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కుటుంబంతో కలిసి విదేశాల్లో కొద్ది రోజుల విరామం తీసుకున్నప్పటికీ, చంద్రబాబు పూర్తిగా పరిపాలనకు దూరంగా ఉండలేదని సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యక్తిగత పర్యటనపై విమర్శలు చేసినా, ముఖ్యమంత్రి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పాలనను పర్యవేక్షించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించగా, రాష్ట్ర చిహ్నంతో రూపొందించిన కొత్త పాసుపుస్తకాలను రైతులకు నూతన సంవత్సర కానుకగా అభివర్ణించారు




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!