

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 100 మంది కౌన్సిలర్లు సామూహికంగా రాజీనామాలు చేసినట్లు వార్తలు రావడంతో టీఎంసీలో తీవ్ర కలకలం నెలకొంది. 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి పార్టీని స్థాపించిన తర్వాత మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీలో అసంతృప్తి మరింత పెరుగుతోందని, పలువురు నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ బరసత్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేత సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరుకావడం సంచలనంగా మారింది. మున్సిపల్ సంస్థల్లో పెరుగుతున్న అసంతృప్తి, పార్టీ నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యేల తక్కువ హాజరు వంటి పరిణామాలు టీఎంసీలో నాయకత్వ సంక్షోభాన్ని మరింత బహిర్గతం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!