

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి క్యూబిట్, వైసర్ సంస్థలతో కలసి క్వాంటం ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ప్రోగ్రామ్కు ఇప్పటికే 50,000 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు, వీరిలో 51 శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులు ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్ విద్యార్థులతో క్వాంటం టాక్ నిర్వహించి, క్వాంటం టెక్నాలజీ ప్రాధాన్యతపై చర్చించారు.
డీప్టెక్ హబ్గా ఆంధ్రప్రదేశ్:
ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ పై దృష్టి సారిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని డీప్టెక్ హబ్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో, “సామాన్యుల సాధికారతే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకుంటోంది. విశాఖకు అనేక IT కంపెనీలు వస్తున్నాయి. భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీ మరియు టెక్నాలజీ కు విశాఖ చిరునామాగా మారబోతోంది. అలాగే, తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం” అని వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!