

మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు తక్షణమే అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జరిగిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన తుఫాను కారణంగా కలిగిన నష్టాలపై సమగ్ర నివేదికలను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. గత కొన్ని రోజులుగా తుఫాను సమయంలో సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగాన్ని సీఎం అభినందించారు. సచివాలయం నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ కలసి ఒక బృందంలా పనిచేయడం వల్ల నష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు. మరో రెండు రోజులు కూడా ఇదే క్రమంలో కృషి చేస్తే బాధిత ప్రజలకు మరింత ఉపశమనం కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. తుఫాను తగ్గిన నేపథ్యంలో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులు, మంత్రులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రజలకు వివరించాలి. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. వివిధ శాఖల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపించాలని సీఎం ఆదేశించారు.











కామెంట్స్ (3)
good decision
సీఎం గారి చర్యలు అభినందనీయం
ప్రశంసనీయం!