
జనరల్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు నిరసనకు తరలివస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని ఇచ్చిన హామీని సీజేపీ తిరస్కరిస్తూ, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన విరమించబోమని సీజేపీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయగా, శాంతిభద్రతల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!