
రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలసి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్రతో చర్చలు జరపడానికి జోక్యం చేసుకోవాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు.
గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని తెలియజేసిన సీఎం, దాన్ని 150 మీటర్లకు పెంచేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎత్తు పెరిగినా ముంపు ప్రాంతం 1000 హెక్టార్లలోపే ఉంటుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!