

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు ఈ వారంలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను ఏ1గా పేర్కొంటూ అభియోగ పత్రం సిద్ధం చేశారు. కేసు విచారణ దాదాపు పూర్తయిందని, అవసరమైన అన్ని పత్రాలు మరియు సాక్ష్యాలను సేకరించామని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ పై కేసు నడిపేందుకు డీవోపీటీ నుంచి అనుమతి రావడంతో చార్జిషీట్ దాఖలు ప్రక్రియ వేగం పెరిగింది.
ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణ వల్ల హెచ్ఎండీఏకు (Hyderabad Metropolitan Development Authority) రూ.75.88 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ పేర్కొంటోంది. అలాగే ఏస్ నెక్స్ట్జెన్ (ACE NextGen) సంస్థకు రేసు బాధ్యతలు ఇవ్వడం, దానికి ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీకి రూ.45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని చార్జిషీట్లో పేర్కొననున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మరో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. నిధుల దుర్వినియోగం, మోసం, కుట్ర వంటి ఆరోపణలను చార్జిషీట్లో చేర్చనున్నట్లు తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!