
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాచారం లీక్ అంశంపై మంత్రులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ సమాచారం ఎలా బయటకు వెళ్తుందో ప్రశ్నించిన ఆయన, ఇకపై కేబినెట్ ఎజెండా ముందుగానే లీకైతే మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా జలధారపై ప్రజల్లో అవగాహన పెంచాలని, పాస్బుక్లకు సంబంధించి అధికారులు, మంత్రులు నెలకు నాలుగు సార్లు పర్యటనలు చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకంపై మరింత దృష్టి పెట్టాలని, పార్లమెంట్లో మహిళా బిల్లుపై చర్చల నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!