

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యత అని, అలాంటి పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం ఉన్నవారే ఉండాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్పై ఎన్నికలకు ముందే ఒక మహిళ చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా అదే వ్యక్తిని పదవిలో నియమించడం ద్వారా ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించారని జగన్ ఆరోపించారు. భక్తి, నిష్ఠ ఉన్న నాయకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోరని ఆయన వ్యాఖ్యానించారు.
లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి నాణ్యత విషయంలో కూడా నిర్లక్ష్యం చూపించారని జగన్ విమర్శించారు. నాణ్యత సమస్యలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ టీటీడీకి చేరి లడ్డూ తయారీలో వాడినట్లు సీబీఐ-సిట్ చార్జిషీట్లలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో నెయ్యి కొనుగోలు ధరలు సాధారణంగా ఉండగా, ప్రస్తుతం హెరిటేజ్కు చెందిన ఇందాపూర్ డెయిరీకి అధిక ధరలకు సరఫరా కట్టబెట్టారని ఆరోపించారు. ఆలయాల నిర్వహణలో భక్తి, నిబద్ధత లేకపోవడం దీనికి నిదర్శనమని జగన్ అన్నారు.




.png&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!