

తెలంగాణలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం మాట నమ్మి పంట మార్పిడి కింద సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. పంట మార్కెట్కు వచ్చి 15 రోజులు అయినా కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. మద్దతు ధర రూ.2400 ఉన్నప్పటికీ రైతులు దళారులకు రూ.1600–1700కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మద్దతు ధరకు మొక్కజొన్న కొనాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో పంటల బీమా లేకపోవడంపై, రెండేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై విమర్శలు చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే సహాయం అందించాలని కూడా కోరారు.



.jpg&w=3840&q=75)

.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!