

తెలంగాణ సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం) మరియు లోక్ భవన్కు బాంబు బెదిరింపు సంచలనం రేపింది. ‘‘సీఎంవో, లోక్ భవన్ను పేల్చేందుకు కుట్ర జరుగుతోంది’’ అంటూ ఖాన్ అనే వ్యక్తి పేరిట గవర్నర్ కార్యాలయానికి ఒక మెయిల్ వచ్చినట్లు సమాచారం. వెంటనే భవనాలను ఖాళీ చేయాలని ఆ మెయిల్లో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమై, బాంబు స్క్వాడ్లను రంగంలోకి దించారు. సీఎంవో, లోక్ భవన్ పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు, ఆ బెదిరింపు మెయిల్ మూలం ఏంటి, ఎవరు పంపించారు అన్న దానిపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూడా మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్ నుంచి అమెరికా (US) వెళ్లే ఓ విమానంలో బాంబు పెట్టినట్లు తెలియజేస్తూ మెయిల్ పంపారు. బాంబు పేలకుండా ఉండాలంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని కూడా ఆందోళన కలిగించేలా డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి, విమానాన్ని ఐసోలేషన్ బే తరలించి పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టారు. ఆ మెయిల్ న్యూయార్క్ నుంచి పంపబడిందని అధికారులు గుర్తించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!