
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఉదయం 9 గంటలకు ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు ప్రకటించారు. X (ట్విట్టర్) లో చేసిన పోస్టులో ఆయన,
“2019 నుండి కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక పెద్ద కంపెనీ మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తుఫానులా తిరిగి వస్తోంది,”
అని పేర్కొన్నారు.
ఆ కంపెనీ వివరాలను ఉదయం 9 గంటలకు వెల్లడిస్తానని చెప్పారు.
దీంతో, ఆ సంస్థ ఏది? ఏ రంగానికి సంబంధించినది? ఏ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెడుతోంది? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ చక్కర్లు కొడుతోంది.
ఇప్పుడు అందరి చూపులు లోకేశ్ 9 గంటల ప్రకటనపై నిలిచాయి.











కామెంట్స్ (1)
నారా లోకేశ్ ప్రకటించనున్న “పెద్ద కంపెనీ రీ-ఎంట్రీ”పై అందరి దృష్టి!