

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యుల సమాజం రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆర్యవైశ్యులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివారని పేర్కొన్నారు. వాసవీ అమ్మవారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను చేపడతామని సీఎం తెలిపారు. వాసవీ సామూహిక పారాయణం గిన్నిస్ రికార్డు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని ఆర్యవైశ్యులు అనుసరిస్తూ దేశ అభివృద్ధికి క్రమశిక్షణతో తోడ్పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.




















.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!