
టెక్నాలజీ

సాక్షి పత్రిక తనపై ప్రచురించిన అసత్య కథనంపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం విశాఖపట్నంలోని 12 వ అదనపు జిల్లా న్యాయస్థానానికి హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాగా, మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు నేడు ఆయన లాయర్లతో కలిసి కోర్టుకు వచ్చారు.
2019 అక్టోబర్ 22 న ‘చినబాబు చిరుతిండి… 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షి పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అసత్యమని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ మంత్రి లోకేష్ ఈ దావా వేశారు. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ కొనసాగుతుండగా, రాజకీయ వర్గాల్లోనూ ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!