
సినిమాలు

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లో ఆయనకు ఈ నోటీసులను అందజేశారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించుకోవచ్చని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నెల 27 వ తేదీన విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు స్పష్టం చేశారు. నోటీసు మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి 27 వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!