

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు ఐటీ మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 410 పెట్టుబడి ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందాల ద్వారా మొత్తం ₹9.8 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయని లోకేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు వచ్చే 12 నెలల్లోనే అమలులోకి రావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తిగా రూపుదిద్దుకోవడానికి మూడు నుండి ఐదు సంవత్సరాల సమయం పట్టొచ్చని చెప్పారు.
ఈ పెట్టుబడులు అమలులోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచే రాష్ట్రంగా అవతరిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. 2024కి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ సంతకం చేసిన ఒప్పందాలే అని చెప్పే విమర్శలపై ఆయన స్పందిస్తూ — “పెట్టుబడులు కాగితాల మీద కాకుండా, నేల మీద కనిపించాలి” అని వ్యాఖ్యానించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!