

టాలీవుడ్ హీరోలు నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలతో తమ మార్కెట్ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మారుతున్న ఓటీటీ వ్యాపార పరిస్థితులు ఇప్పుడు ఈ చిత్రాల మేకర్స్కు కొత్త ఆందోళనగా మారినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. నాగచైతన్య నటిస్తున్న “వృషకర్మ” సినిమా ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ పూర్తయినా, ఓటీటీ డీల్ మాత్రం మేకర్స్ ఆశించిన స్థాయిలో లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
అదే పరిస్థితి సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న “సంబరాల ఏటి గట్టు” మరియు నిఖిల్ సిద్ధార్థ్ “స్వయంభూ” సినిమాలకు కూడా ఎదురవుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. “విరూపాక్ష” విజయంతో భారీ డిజిటల్ బిజినెస్ వస్తుందని భావించినప్పటికీ, ప్రస్తుతం ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలు పెట్టేందుకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా “స్వయంభూ” సినిమాకు సరైన ఓటీటీ ఒప్పందం ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల తేదీ కూడా వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!