

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ 'రౌడీ జనార్థన'ను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు మరియు శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను హైదరాబాద్లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య ఘనంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ మాట్లాడుతూ, రవికిరణ్ కోలా విజన్ ఎంత పెద్దదో మొదటి మీటింగ్కే అర్థమైందని తెలిపారు. ఇప్పటివరకు విడుదలైన టైటిల్ గ్లింప్స్ కేవలం చిన్న శాంపిల్ మాత్రమేనని, ఇంకా ఎంతో ఎగ్జైటింగ్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెప్పారు. అలాగే డీవోపీ ఆనంద్ సి చంద్రన్ మాట్లాడుతూ, రౌడీ జనార్థన నుంచి మరిన్ని సర్ప్రైజింగ్ విజువల్స్ త్వరలో విడుదల చేస్తామని, గ్లింప్స్ ప్రేక్షకులకు నచ్చిందని ఆశిస్తున్నామని తెలిపారు.
డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ కథ వినగానే క్యారెక్టర్ను ఇన్స్టంట్గా ఓన్ చేసుకుని స్పందించడమే ఈ ప్రాజెక్ట్కు పెద్ద బలం అయిందన్నారు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ డైలాగ్ డెలివరీ అత్యంత న్యాచురల్గా ఉందని, ఆ యాస అసలైన ఫ్లేవర్ కోల్పోకుండా ఉండాలని విజయ్, దిల్ రాజు ఇద్దరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ, ఇప్పటివరకు యూత్ఫుల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్, ఈ చిత్రంలో తొలిసారిగా పూర్తిస్థాయి మాస్, బ్లడ్షెడ్ పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. 1980ల నేపథ్యాన్ని శక్తివంతంగా ఆవిష్కరించిన టెక్నికల్ టీమ్ కృషితో సినిమా అత్యంత గ్రాండ్గా రూపుదిద్దుకుంటోందని, ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నామని వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!