

శ్రీమతి చింతా వరలక్ష్మీ సమర్పణలో, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై, చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా, చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన శ్రీ చిదంబరం చిత్రంలో లెజండరీ సంగీత దర్శకుడు ఎం.ఎమ్.కీరవాణి ఆలపించిన వెళ్లేదారిలో పాట విడుదలైంది. వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట కథానాయకులు. ఇటీవల విడుదలైన టీజర్కు వచ్చిన అద్భుతమైన స్పందనతో, ఈ బ్యూటిఫుల్ పాట రిలీజ్ కూడా ప్రేక్షకుల ఆకాంక్షలను మరింత పెంచింది. చందు రవి సంగీతం సమకూర్చిన ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యం అందించగా, కీరవాణి గారి గాత్రం పాటకు జీవం పోసింది. లిరిక్స్ మరియు మెలోడీ ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంది.

నిర్మాతలు మాట్లాడుతూ, “కీరవాణి గారి ఆలపనతో పాట మరింత ప్రత్యేకత పొందింది. సినిమా ఒక అందమైన ప్రేమకథ, వింటేజ్ గ్రామ నేపథ్యంతో కొత్తదనం, సహజత్వం, ప్రతి పాత్ర మరియు విజువల్లో సహజత్వం ఉంటుంది. హీరో అసలు పేరు కాకుండా ఊరంతా ఎందుకు ‘చిదంబరం’ అని పిలుస్తారు? అతను ఎప్పుడూ సన్గ్లాసెస్ ఎందుకు వేసుకుంటాడు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంది. గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సాంకేతిక బృందంలో అక్షయ్ రామ్ పొడిశెట్టి, ఎడిటర్ అన్వర్ అలీ, సంగీత దర్శకుడు చందు రవి, ఆర్ట్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ పుల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ షేక్ రజాక్, టి. కార్తీక్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ అఖిలేష్ రేలంగి, ఏలూరు శీను, మాధురి మధు ఉన్నారు.”










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!