

యూనిటీ – ది మాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీకి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు లభించింది. భూదాన్ పోచంపల్లి కు చెందిన యువ దర్శకుడు విజయ్ కుమార్ బాదుగు ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రజల తండ్రిగా పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత గాధను ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరిస్తుంది. డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ జ్యూరీ ఛైర్మన్ విజయ్ కనకమేడల హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) కార్యాలయంలో విజేతలను అధికారికంగా ప్రకటించారు.
చిరందాస్ శ్రీకాంత్ నిర్మించిన ఈ 30 నిమిషాల డాక్యుమెంటరీలో మైమ్ మధు, బాలనటుడు మాస్టర్ భాను కీలక పాత్రల్లో కనిపించారు. స్పష్టమైన కథనం, ఉన్నత స్థాయి చిత్రీకరణ, ఆకర్షణీయమైన ఎడిటింగ్తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది అని జ్యూరీ ప్రశంసించింది. ఈ అవార్డు పొందే ముందు ముంబైలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అవార్డులు, అలాగే న్యూఢిల్లీ లో జరిగిన 15వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్-2025లో ఉత్తమ దర్శకుడి అవార్డు కూడా ఈ చిత్రానికి లభించింది.

















.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!