
సినిమాలు

త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె చీర లుక్ అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఆ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలను త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారడంతో అభిమానులు ఆమె హుందాతనాన్ని ప్రశంసిస్తున్నారు.
త్రిష పోస్ట్కు ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు చేసిన కామెంట్ ప్రత్యేకంగా నిలిచింది. “నిన్ను ప్రేమించకుండా ఉండేందుకు నాకు ఒక్క కారణం చెప్పు. లోపల, బయట అత్యంత అందమైన వ్యక్తివి నువ్వే” అంటూ ఖుష్బు ప్రశంసించారు. ఈ వ్యాఖ్య త్రిష అభిమానులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం ఆమె ఫొటోలతో పాటు ఖుష్బు కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!