
దర్శకుడు వేణు యెల్దండి ఎల్లమ్మను ఏ ముహూర్తంలో ఆలోచించాడో తెలియదు, కానీ ఈ ప్రాజెక్ట్కి స్టార్ట్ నుంచి అవాంతరాలే వెంటాడుతున్నాయి. ముందుగా స్క్రిప్ట్ నాని దగ్గరకు వెళ్లింది. న్యాచురల్ స్టార్కి కథ బాగా నచ్చినా, ప్యారడైజ్ సహా ఇంకోన్ని లెక్కలు కలిసి రాకపోవడంతో ఆయన బయటకు వచ్చాడు. తరువాత నితిన్ పేరు చేరింది. “తమ్ముడు” బ్లాక్బస్టర్ అయ్యుంటే దిల్ రాజు లెక్కలు మారేవి, కానీ పరిస్థితి తారుమారైంది. ఆపై ఇద్దరు తమిళ హీరోల పేర్లు కూడా వినిపించాయి.
చివరికి ఎవ్వరూ ఊహించని రీతిలో దేవిశ్రీ ప్రసాద్ పేరు హవాగా మారింది. తొలిసారి హీరోగా మేకప్ వేసే ఛాన్స్ కూడా దక్కిందనే టాక్ ఉంది- అయితే ఇదంతా ఇప్పటికీ అధికారికం కాదు.
ఇప్పటి వరకు ఎల్లమ్మలో హీరోయిన్గా వినిపించిన పేరు కీర్తి సురేష్. కానీ తాజాగా రివాల్వర్ రీటా ప్రెస్ మీట్లో “అందులో నేను లేను” అని చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
దేవి కొత్త హీరో కాబట్టి తనతో చేయడానికి ఇష్టపడలేదా? లేక మరో కారణం ఉందా? అనేది ఇంకా మిస్టరీగానే ఉంది.
దిల్ రాజు కూడా కొన్ని వారాలుగా మీడియాకు దూరంగా ఉన్నారు. ఓజీ ఈవెంట్ తర్వాత ఆయన కెమెరాలకు కనిపించడం అరుదైపోయింది. వేణు పరిస్థితి కూడా అలాగే... ఎక్కడైనా దర్శనమిస్తాడేమో అనుకుంటుంటే, అలా కనిపించే ఛాన్స్ ఇవ్వడం లేదు.
ఇలా చూస్తుంటే ఎల్లమ్మ ప్రాజెక్ట్కు ఇంకా కొంత సమయం పడేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్తో ఫైనల్ అయ్యినా సరే, నిర్మాణానికి భారీ టైమ్ అవసరం అవుతుందని అంచనా. దిల్ రాజు కూడా బడ్జెట్ రిస్క్ తగ్గించేలా కొత్త లెక్కలు వేసుకుంటున్నారట. వేణు చెప్పిన భారీ బడ్జెట్ను కాస్త తగ్గించే మార్గాలు వెతుకుతున్నారనే సమాచారం.
కొన్నేళ్ల క్రితం వివి వినాయక్ను హీరోగా పరిచయం చేస్తూ శీనయ్య అనే సినిమా అనౌన్స్ చేసిన దిల్ రాజు… అది షూట్కు వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఎల్లమ్మకు అలాంటిది జరగకపోతే చాలు.
బలగం తర్వాత వేణు యెల్దండి ప్రాణం పెట్టుకున్న సినిమా ఇదే అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!