
.jpeg&w=3840&q=75)
విడుదలకముందే ఒక సినిమా చుట్టూ ఇంత హైప్ రావడం అరుదు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాపై ప్రస్తుతం ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు చర్చ నడుస్తోంది. ‘చి ల సౌ’తో దర్శకుడిగా జాతీయ పురస్కారం గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్, ఈసారి కూడా అదే స్థాయి క్వాలిటీతో సినిమా తీశాడని వినిపిస్తోంది. ‘మన్మథుడు-2’ అనుభవాల తర్వాత రాహుల్ తన స్టైల్లోనే ఈ సినిమాను తెరకెక్కించాడట. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆధునిక రిలేషన్షిప్లను సున్నితంగా చూపిస్తూ భావోద్వేగాలతో కూడిన కథను చెప్పాడని అంటున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని కొంతమందికి ఈ సినిమా చూపించగా, చూసిన వారు “ఇది స్పెషల్ ఫిల్మ్” అని ప్రశంసించారట.
సెన్సార్ బోర్డు నుంచి మంచి స్పందన రావడం కూడా పాజిటివ్ సైన్గా చూస్తున్నారు. రష్మిక నటన ఈసారి కొత్త స్థాయిలో ఉందని, ఆమెకు నేషనల్ అవార్డు రావొచ్చని టాక్ నడుస్తోంది. దీక్షిత్ శెట్టి కూడా తన పాత్రతో ఇంప్రెస్ చేశాడట. ఇది కేవలం ప్రమోషనల్ హైప్ మాత్రమేనా, లేక నిజంగానే సినిమా అంత బలంగా ఉందా అన్నది నవంబర్లో విడుదల తర్వాత తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.











కామెంట్స్ (2)
రష్మిక మరో స్థాయిలో మెరిసే సమయం ఇది!
lady rockstar