

బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ డ్రామా ‘మర్దానీ 3’ ట్రైలర్పై భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందించింది. మహిళలపై జరుగుతున్న నేరాలకు కఠినమైన, వెంటనే అమలయ్యే శిక్షలు అవసరమని ఆమె గట్టిగా అభిప్రాయపడింది. ట్రైలర్ చూసిన తర్వాత తన భావాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
“‘మర్దానీ 3’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని హర్మన్ప్రీత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ఈ సందర్భంగా దేశంలోని బాలికలు, మహిళల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసు బలగాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రతిరోజూ మన భద్రత కోసం సిద్ధంగా ఉండే పోలీస్ ఫోర్స్పై తన అభిమానాన్ని వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు చెందిన 8 – 9 ఏళ్ల బాలికలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కిడ్నాప్ సమస్యపై ‘మర్దానీ 3’ దృష్టి సారిస్తోంది. గతంలో వచ్చిన ‘మర్దానీ’ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని చూపించగా, ‘మర్దానీ 2’ ఒక సీరియల్ రేపిస్ట్ కథతో ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!