

బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘అఖండ 2’ చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే ప్రశ్న అందరి మధ్య చర్చనీయాంశంగా మారింది. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘అఖండ 2 ఇష్యూ పూర్తిగా క్లియర్ అయింది’’ అని తెలిపారు. ఆయన అంచనా ప్రకారం సినిమా డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశముందని చెప్పారు.
తమ్మారెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది ‘హరి హర వీర మల్లు’ మరియు ‘అఖండ 2’ సినిమాలకు ఆర్థిక కమిట్మెంట్ల కారణంగా రిలీజ్ సమస్యలు వచ్చాయని వివరించారు. ‘‘హరి హర వీర మల్లు ఇష్యూ ఎలా క్లియర్ అయి విడుదలైందో, ఇప్పుడు ‘అఖండ 2’ కూడా అదే విధంగా క్లియర్ అయింది. అందరూ వేచి ఉన్నందున మేకర్స్ సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేస్తారు’’ అని ఆయన తెలిపారు. సినిమా ఆలస్యంగా విడుదలైనంత మాత్రాన దాని ఫలితంపై పెద్దగా ప్రభావం ఉండదని, ఓపెనింగ్స్ మాత్రం అలాగే వస్తాయని చెప్పారు.
‘అఖండ 2’ డిసెంబర్ 12న విడుదల కానుందనే వార్తలతో పలు ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఓవర్సీస్లోనూ బుకింగ్స్ స్టార్ట్ అవ్వడంతో, మేకర్స్ త్వరలోనే అధికారిక తేదీని ప్రకటించే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త తేదీగా డిసెంబర్ 12 ఎక్కువగా వినిపిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!