
జనరల్

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన తొలి పాటకు అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు సెకండ్ సింగిల్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సూర్య పుట్టినరోజు సందర్భంగా జూలై 23న ఈ పాటను విడుదల చేసి అభిమానులకు ప్రత్యేక కానుక ఇవ్వాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.
ఈ పాటకు హీరో సూర్య స్వయంగా గాత్రం అందించినట్లు టాక్ వినిపిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, కెన్ కరుణాస్ సాహిత్యం అందించారు. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సెకండ్ సింగిల్ సినిమా మ్యూజికల్ హైలైట్గా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!