

సూర్య తన కెరీర్లో తొలిసారిగా విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో పూర్తి స్థాయి తెలుగు సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధిక శరత్కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2026 ఆగస్టు 14న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. సూర్య తొలి తెలుగు చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్లో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!