

‘శంబాల’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మరో భారీ ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నారు. ఈసారి వారు హీరో సందీప్ కిషన్తో కలిసి ఒక పాన్ ఇండియా సోషియో ఫాంటసీ సినిమాను ప్రకటించారు. ‘శంబాల’ తర్వాత ఈ దర్శక – నిర్మాతల జంట ఏ ప్రాజెక్ట్ చేస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఈ భారీ చిత్రంతో ఆ ఆసక్తికి సమాధానం ఇచ్చారు.
ఈ సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చాలా ఆసక్తిని కలిగిస్తోంది. పోస్టర్లో యుద్ధభూమి నేపథ్యంతో ఒక సింహం, తోడేలు కనిపిస్తాయి. వాటి మధ్యలో ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ నిల్చుని ఉంటుంది. “కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు... కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు” అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా ఉండనుందని చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానుందని నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు మరియు సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్లు చెప్పారు.


.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!