
న్యూస్

ఆది హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శంబాల అన్ని చోట్లా అద్భుతమైన స్పందన అందుకుంటోందని దర్శకుడు తెలిపారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25 న విడుదలై, ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తొలి రోజు నుంచే హౌస్ ఫుల్ షోలతో దూసుకుపోతూ మంచి వసూళ్లు రాబడుతోంది.
మీడియాతో ముచ్చటించిన యుగంధర్ ముని, శంబాల కథను మూడేళ్ల పాటు ఎంతో బాధ్యతతో రూపొందించామని, సైన్స్ మరియు శాస్త్రానికి మధ్య సమతుల్యతను పాటించామని చెప్పారు. ఆది అంకితభావం, టెక్నికల్ టీమ్ పనితనం, నిర్మాతల పూర్తి సహకారమే ఈ విజయానికి కారణమని తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా మంచి స్పందన వస్తోందని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులోనూ సూపర్ నేచురల్, థ్రిల్లర్ జానర్లలో సినిమాలు చేయనున్నట్లు వెల్లడించారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!