

అగ్ర కథానాయిక సమంతకు అత్తవారింట్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగిన తర్వాత, రాజ్ కుటుంబ సభ్యులు ఆమెను ఆత్మీయంగా ఆహ్వానించారు. ముఖ్యంగా రాజ్ సోదరి ప్రత్యేకంగా “చంద్రకుండ వద్ద శివారాధన చేస్తున్నప్పుడు—తడిసిపోయి వణుకుతూ, ప్రదోషకాలపు పవిత్రతలో—ఆమె శివలింగాన్ని ఆలింగనం చేసిన ఆ క్షణం, తన హృదయాన్ని ఎంత కృతజ్ఞతతో నింపిందో చెబుతుంది. ఆ శాంతి, కుటుంబంపై వచ్చిన కొత్త స్పష్టత, అలాగే రాజ్ మరియు సమంత ప్రయాణంలో కనిపిస్తున్న ఆ లోతైన ‘సమన్వయం’ ఆమెను ఎంతగానో హత్తుకుపోయాయి.
రాజ్–సమంత ఇద్దరూ గౌరవంగా, నిజాయితీగా ఒకే దారిని ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్న తీరు చూసి, కుటుంబంగా మాకు గర్వంగా ఉందని ఆమె చెబుతోంది.
ఈ పవిత్ర రోజున కుటుంబమంతా కలిసి ఇషా పూజలు చేసిన అనుభూతి—జీవితంలో ఒక్కో అందమైన క్రమం ఇలా సహజంగా చేరుతుందనీ ఆమెకు గుర్తు చేసింది. కొన్ని సంబంధాలు శాంతిగా మన జీవితాల్లో ప్రవేశిస్తాయని ఆమె మనస్ఫూర్తిగా చెప్పారు. చివరగా, నువ్వుల దీపాల ముందు నిలబడి, “మన కుటుంబంలోనే కాదు, ప్రతి ఒక్కరికీ ఇటువంటి శాంతిగా, స్థిరంగా, ‘సరిగ్గా అనిపించే’ ప్రేమ దొరకాలి”. అని ఎమోషనల్ నోట్ని పంచుకుని సమంతపై తన ప్రేమను వ్యక్తం చేసింది.
డిసెంబర్ 1న సమంత – రాజ్ నిడిమోరు జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ హ్యాపీ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షల వరద కురిపిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!